UPDATES  

 ఛత్తీస్‌గఢ్ సరిహద్దులలో భారీ ఎన్‌కౌంటర్…

 

మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.

. మావోయిస్టులు సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్ బలగాలతో కలిసి పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.

మావోయిస్టులను గుర్తించిన బలగాలు ఒక్కసారిగా భారీ ఎత్తున కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన మావోయిస్టులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మొత్తం నలుగురు అగ్రనేతలు హతమైనట్లు సమాచారం. హతమైన మావోయిస్టులపై రూ.36 లక్షల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో డీవీసీ సభ్యుడు వర్గీస్, డీవీసీ మంగాతు, ప్లాటూన్ సభ్యులు కురసం రాజు, వెంకటేశ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి ఏకే47, ఒక కార్బెన్, రెండు పిస్టల్స్, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు బలగాలు వెల్లడించాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !