UPDATES  

 బందెల సాంబయ్య కుటుంబానికి సహాయం అందించిన సేవా ట్రస్ట్…

మన్యం న్యూస్ మంగపేట. శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల కమలాపురం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ బందెల సాంబయ్య రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం విధితమే వారిది నిరుపేద కుటుంబం అని తెలుసుకున్న శ్రీ లక్ష్మీనరసింహ దత్త సేన సేవా ట్రస్ట్ తరఫున నుంచి బందెలా సాంబయ్య కుటుంబానికి మోహన వంశీకృష్ణ బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం, మరియు నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది.ఇది అత్యంత చిన్న సహాయం మాత్రమే, ఈ విధంగా దాతలు ఎవరు అయినా ముందుకు వచ్చి ఈ కుటుంబం కు సహాయం చేయాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు , ఎస్తేరు రాణి, కర్రి రమేష్, జై భీమ్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు,

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !