లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) నాయకుడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం బెంగళూరు సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజ్వల్ పేరుతో ఈ పిటిషన్ దాఖలైనట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. కాగా, లైంగిక ఆరోపణల అనంతరం విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్ రేపు భారత్కు రానున్నట్లు తెలుస్తోంది.
