- ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించిన మంత్రి సీతక్క.
- వర్షాకాలం నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి అని ఆదేశాలు జారీ.
మన్యం న్యూస్ ఎటుర్ నాగారo.
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కేంద్రంలో పంచాయతీ రాజ్,శిశు శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. ఆమె పర్యటనలో భాగంగా
మండలం లో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు, విద్యార్థులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేసారు.రానున్న వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా,వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం,విద్య ఇవ్వలని వీటి విషయంలో ఎటువంటి నిర్లక్ష్యపు వైఖరి అవలంబించొద్దని ఆమె అధికారులతో అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఏటూరు నాగారం,మంగపేట మండలాల్లో కరకట్ట నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో కరకట్టలకు ఉపయోగించే కొత్త జియో టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు ఆమె తెలిపారు.ఇరిగేషన్ శాఖ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని,వారం రోజుల్లో నాలుగు సార్లు రివ్యూ సమావేశం కూడా నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పర్యటనలో మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్,ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా పాల్గొన్నారు..