UPDATES  

 మన్యంలో మళ్ళీ పేలిన తుపాకి తూటా…

మన్యం న్యూస్ చర్ల.

చతిస్-ఘడ్ నారాయణపూర్ జిల్లా కొహకామెటా పోలీస్ స్టేషన్ పరిధిలోని దినంది-కుర్రెవాయ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకి మధ్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.

మావోయిస్టుల కంచుకోట అబూజ్ మాడ్ అటవీ ప్రాంతంలో ఇరువురి మధ్య కొనసాగుతున్న ఎదురు కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. బలగాలకు మావోలకు మధ్య కొనసాగుతున్న బీకర ఎదురుకాల్పుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు బస్తర్ ఐజి సుందర్ రాజ్ వెల్లడించారు.

మరి కొద్దిసేపట్లో ఐజి సుందర్ రాజ్ పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఎన్కౌంటర్ కు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !