UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 IT రైడ్స్ మీద DEVINENI అవినాష్ ఊహించని వ్యాఖ్యలు..!

తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి టీఆర్ఎస్, బీజేపీ పోరు అన్నట్టుగా నడిచిన విషయం తెలిసిందే. ఐటీ అధికారులు తెలంగాణలో వరుసగా దాడులు చేసిన విషయం తెలిసిందే.

ఆ దాడులు ఇప్పుడు ఏపీకి కూడా పాకాయి. వంశీరామ్ బిల్డర్స్ పై నిన్న ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. వంశీరామ్ బిల్డర్స్ పై నిన్న జరిగిన ఐటీ తనిఖీల్లో భాగంగా ఆ సంస్థతో సంబంధం ఉన్న, లావాదేవీలు జరిపిన వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. విజయవాడలో ఆయన ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఆ సమయంలో అవినాష్ ను కూడా అధికారులు చాలా సేపు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.దేవినేని అవినాష్.. అధికార వైఎస్సార్సీపీ పార్టీకి విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ చార్జ్ గా ఉన్నాడు. ఆయన ఇంట్లో నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం 6 వరకు ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే.. ల్యాండ్ డెవలప్ మెంట్ ఒప్పందంపై వంశీరామ్ బిల్డర్స్ తో అవినాష్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. దానిపైనే అధికారులు అవినాష్ ను కూడా ప్రశ్నించారు. ఐటీ అధికారులు వెళ్లిపోయిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు తెలిపారు.

ఐటీ శాఖ అధికారుల కోసం నేను పూర్తిగా సహకరించాను. మా జీవితాలు తెరిచిన తెల్ల పుస్తకాల్లాంటివి. ప్రజలే మాకు ఆస్తులు. మాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. దేవినేని కుటుంబం గురించి అందరికీ తెలిసిందే కదా. మేము నిత్యం ప్రజల్లో ఉంటాం.. రాజకీయాలు చేయడం మాత్రమే మాకు తెలుసు. సాధారణమైన తనిఖీ మాత్రమే ఇది. ఈ సోదాల్లో ఎలాంటి అక్రమాలు బయటపడలేదు.. అంటూ దేవినేని అవినాష్ చెప్పుకొచ్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !