UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 G20 సన్నాహక సదస్సుకి CM KCR డుమ్మా.!

జీ20 సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం మన దేశ ప్రధానికి రావడమంటేనే మనకెంతో గర్వకారణం, అలాంటి సదస్సుకి సంబంధించి సన్నాహాక సమావేశంలో భాగంగా దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, ఆయా పార్టీల అధినేతలకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆహ్వానం పలికితే, ఆ కార్యక్రమానికి వెళ్ళకపోవడమేంటి.? అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది బీజేపీ. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిథి ఎన్వీ సుభాష్ పత్రికా ప్రకటనలో, కేసీయార్‌ పై మండిపడ్డారు. జీ20 సమావేశానికి హాజరు కాలేదంటే, అన్ని స్కామ్‌లలో వున్నందుకు కేసీయార్, మోడీకి మొహం చూపించే దమ్ము లేకనే.. అని భావించాల్సి వస్తుందని బీజేపీ ఆరోపిస్తోంది. మీ పాపం పండే రోజులు దగ్గరలోనే… ‘జీ20 సమావేశంలో పాల్గొంటే అక్కడికి వచ్చిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షుల ముందు మీ అవినీతి, మీ కుమార్తె అవినీతి బండారం బయటపడుతుందనే మీరు రాలేదు.. స్కామ్‌లు, దందాలూ చేసి వుండకపోతే, సమావేశానికి ధైర్యంగా హాజరై మీ నిజాయితీని నిరూపించుకునేవాళ్ళు కదా..’ అని బీజేపీ ఎద్దేవా చేసింది. ‘బీజేపీ పాలనలో దేశంలో అవినీతి పరులపై ఉక్కుపాదం మోపుతున్నాం.. అది కేసీయార్‌కి గిట్టడంలేదు..’ అంటూ ఎన్వీ సుభాష్ వ్యాఖ్యానించారు.’లిక్కర్ స్కామ్‌లో నువ్వు, నీ కూతురి బాగోతం కూడా బయటపడిపోయిందనే ఆందోళనలో వున్నావ్..’ అంటూ కేసీయార్‌పై మండిపడ్డారాయన.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !