UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 ఇటీవల వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి సమైక్యాంధ్ర వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇప్పుడు వైకాపా ది సమైక్యాంధ్ర నినాదం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. కుదిరితే ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలను ఏకం చేయాలి అనేది మా కోరిక అన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా సమైక్య రాష్ట్రంపై ప్రకటనలా అంటూ మండిపడ్డాడు. సమైక్య రాష్ట్రం పేరు చెప్పి ప్రజలను మళ్లీ మభ్య పెట్టడం మోసపూరితమవుతుంది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన కంటే వైసీపీ పాలన వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల పెరగడం ఆందోళనకరంగా ఉందని టిడిపి హహంలో వ్యవసాయ రంగంలో రికార్డు సాధించామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వైసీపీ రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన తప్పులను ప్రభుత్వ పెద్దలను సరిదిద్దుకోవాలని చంద్రబాబు నాయుడు అన్నాడు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా వ్యవహరించాలి కాని సమైక్య నినాదం ఎత్తుకొని ప్రజలను మభ్య పెట్టవద్దని బాబు ఎద్దేమో చేశాడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !