UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 మాజీ మంత్రి కొండా ,కాంగ్రెస్ నేత సురేఖ రాజీనామా

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి కాదు. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నామనీ, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తన పేరు లేకపోవడం ఆందోళన కలిగించిందనీ, వరంగల్‌కి సంబంధించి ఒక్క లీడర్ పేరు కూడా లేకపోవడం బాధగా వుందనీ కొండా సురేఖ వాపోయారు.

తన కంటే జూనియర్లకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ప్రాధాన్యత కల్పించడమంటే తనను అవమానపరచడమేనని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకీ గుడ్ బై చెబుతారా.? ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచన లేదనీ, కాంగ్రెస్ పార్టీ లోనే కొనసాగుతాననీ కొండా సురేఖ అంటున్నారు. అయితే, ఆమె వైఎస్ షర్మిల నేతృత్వంలో ఏర్పాటైన వైఎస్సార్ తెలంగాణ పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

వైఎస్ షర్మిల అరెస్టు తదనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరూ గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె షర్మిల వైపు వెళతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొండా సురేఖ మాత్రం పార్టీ మారేది లేదంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !