UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 తానా సభ్యుల సేవానిరతికి జనం జేజేలు

తానా సభ్యుల సేవానిరతికి జనం జేజేలు పలుకుతున్నారు. తమ సొంత గ్రామాల్లో తానా సభ్యులు అసహాయులకు, విద్యార్థులకు చేస్తున్న సేవలను అందరూ కొనియాడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తానా సభ్యులు ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ ప్రభుత్వ పాఠశాలలకు కాలినడకన 6 కి.మీలు నడిచి వస్తున్న విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసి తన ఉదారత చాటుకున్నాడు తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ. ఖమ్మం రఘునాధపాలెం మండలంలోని. వి. వెంకటాయపాలెం హైస్కూలులో 6 కిలోమీటర్లు దూరం నుండి నడిచి వచ్చే ఆరుగురు బాలికలకు ‘తానా ఆదరణ’ కార్యక్రమంలో 6 సైకిళ్ళు అందజేశారు.

పాఠశాల లో జరిగిన ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ చైర్మైన్ యార్లగడ్డ వెంకట రమణ గారు సైకిళ్ళుతో పాటు 10తరగతి చదువుతున్న 50 మంది విద్యార్థులకు ఎక్సామినేషన్ కిట్స్ అందజేసారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, కోఆర్డినేటర్ బండి నాగేశ్వరరావు గారు, ఇతర తానా ఫౌండేషన్ వాలంటీర్లు పాల్గొన్నారు. విద్యార్థులు తానా చేస్తున్న కృషికి వితరణకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. సైకిళ్లు అందుకున్న వారిలో నగర శివారు వెలుగుమట్ల సాగర్ కాల్వపై నివసించే ఐదుగురు, వేపకుంట్లకు చెందిన ఒక విద్యార్థిని ఉన్నారు. వీరు ఈ పాఠశాలలో ఆరు, ఏడు తరగతులు చదువుతున్నారు. వారు పాఠశాలకు వచ్చివెళ్లేలా ఉపయోగపడేందుకు తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ చేతుల మీదుగా సైకిళ్లు అందించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !