మన్యం న్యూస్ ,ఇల్లందు జనవరి11: తెలుగు పండగ సంక్రాంతి అనగానే మనకు మొదట గుర్తొచ్చేది ముగ్గులు. సంక్రాంతికి తెలుగు లోగిళ్లలో రకరకాల రంగవళ్లుల తివాచీ పరుచుకుంటుంది.బుధవారం రోజు సంక్రాంతి సందర్భంగా స్థానిక 12 అవార్డు ఆర్ అండ్ ఆర్ కాలనీలో గల కమ్యూనిటీ హాల్ అవరణలో కోకో కోల కంపెనీ మరియు వార్డు కౌన్సిలర్ అనిత, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, వార్డు కమిటీ సభ్యులు, సంయుక్తంగా ముగ్గుల పోటీ నిర్వహించారు.పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.