సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ చారిత్రాత్మకం
బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి
ముఖ్యమంత్రి కెసిఆర్ రాక ఎంతో ఆనందదాయకం
ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 13… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధకుడు ప్రజా సంక్షేమానికి అలుపెరగని శ్రామికులు. తెలంగాణ రాష్ట్ర పితామహుడు ముఖ్యమంత్రి కెసిఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రావడం నేడు దేశ రాజకీయాలను శాసించే విధంగా ఏర్పాటైన భారత రాష్ట్ర సమితి జిల్లా పార్టీ కార్యాలయాన్ని కొత్తగూడెంలో ప్రారంభించుకోవడం నేడు సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మన్యం న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణలో ప్రజా సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేస్తూ సంక్షేమ ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కారణజన్ముడు అయ్యారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలు స్వాగతించడం గొప్పదని అన్నారు. బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రజా ప్రతినిధులతో సమన్వయంగా వ్యవహరించడంలో ఎంతో కష్టపడ్డానని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలతో కూడుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించడం బిఆర్ఎస్ శ్రేణుల్లో ఒక నూతన అధ్యయం సంతరించుకుందని ఆయన అన్నారు. రానున్న రోజులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖిల్లా ఫై బిఆర్ఎస్ జెండా ఎగరవేయడం తధ్యమని స్పష్టం చేశారు. భద్రాద్రి జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇళ్ల స్థలాల మంజూరు కోసం స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించిన విజ్ఞప్తి మేరకు భద్రాద్రి జిల్లా పర్యటనలు భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ప్రకటించడం హర్షించదగ్గ విషయం అన్నారు. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రతి గ్రామ పంచాయతీకి రూ 10 లక్షల రూపాయలు, మున్సిపాలిటీలకు 40 లక్షలు నిధులు స్వయంగా ముఖ్యమంత్రి నిధుల నుండి ప్రకటించడం గొప్ప మనసున్న మారాజుగా కెసిఆర్ అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం వాటిలిందని అన్నారు. ఒక క్రియాశీలకంగా లేకుండా ఆలోచన పరిజ్ఞానం తగ్గి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని చూస్తే దేశ ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ సేవలు అత్యంత అవసరంగా ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ఒక సువర్ణ అవకాశమని అందుకు సహకరించిన ప్రజా ప్రతినిధులు వివిధ శాఖ అధికారులు మీడియా ప్రతినిధులు అందించిన సంపూర్ణ సహకారం వల్ల విజయవంతం చేశామని ప్రభుత్వ విప్ స్పష్టం చేశారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు పెద్దలకు ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రభుత్వ విప్ జిల్లా క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్, కర్నే మురళి, ఎమ్మెల్యే పి ఏ లు చందా హరికృష్ణ, సాయినాథ్ మహేశ్వరం, జిల్లా మైనార్టీ విభాగపు నాయకులు, అన్వర్ పాషా, రేగ యువసేన బాధ్యులు పోతురాజు రవి, ప్రధాన అనుచరులు, అభిమానులు సోషల్ మీడియా కన్వీనర్లు తదితరులకు కృషికి అభినందనీయమని అన్నారు.
