UPDATES  

 కేరళలో దారుణం

కేరళలో దారుణం చోటుచేసుకుంది. స్కూల్ స్టూడెంట్స్‌పై ఓ సీనియర్ టీచర్.. కొన్నేళ్లపై లైంగిక వేధింపులకు గురిచేశాడు. తాజాగా టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి కేరళ కన్నూరు జిల్లాలోని ఓ పాఠశాలలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోవిడ్ సంక్షోభం అనంతరం 2021 నవంబరులో ఆ స్కూల్ రీ ఓపెన్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ విద్యార్థులపై 52 ఏళ్ల టీచర్ కన్నేశాడు.

అప్పటి నుంచి దాదాపు 26మందిని అతను లైంగికంగా వేధించాడు. విద్యార్థులు ధైర్యం చేసుకుని ఈ వేధింపుల వ్యవహారానికి బయటికి చెప్పలేకపోయారు. కానీ ఓ విద్యార్థిని ధైర్యం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. టీచర్ సాయంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. 12న సీనియర్​ టీచర్​ను అరెస్ట్​ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !