మన్యం న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
ఖమ్మంలో ఈనెల 18వ తేదీన జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను సోమవారం సాయంత్రం మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి,పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, శాసనమండలి సభ్యులు పాడి కౌశిక్ రెడ్డిలు పర్యవేక్షించారు.ఈ సందర్భంగా సభా వేదిక పటిష్ఠత, సీటింగ్, పార్కింగ్, కళాకారులు, ప్రెస్ అండ్ మీడియా గ్యాలరీల ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.కాలినడకన మైదానం అంతా కలియతిరిగారు. మిగిలి ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత వ్యక్తులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు.
