మన్యం న్యూస్ గుండాల ,జనవరి18.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని మండల కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు తోలం సాంబయ్య ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగరవేసి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇల్లందుల నరసింహులు, ఇల్లందుల అప్పారావు, పోలు కనకయ్య, బుచ్చయ్య, మధు, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
