మన్యం న్యూస్, అశ్వారావుపేట, జనవరి 18: ఖమ్మం జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన బిఆర్ఎస్ సభకు అశ్వరావుపేట మండలం నుంచి వేలాది మంది నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లారు. అశ్వరావుపేట నియోజక వర్గం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆదేశానుసారం ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి కార్యకర్తలతో కలిసి సభకు బయలుదేరిన బస్సును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలు అభిమానులు జై బిఆర్ఎస్ జై జై బిఆర్ఎస్, కెసిఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేసి బస్సు మీద సభకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
