మన్యంన్యూస్ వెంకటాపురం.
వెంకటాపురం మండలం వీరభద్రారం గ్రామంలో బుధవారం డిప్యూటీ తాసిల్దార్ ఆర్ రాజేశ్వర్ రావుగ్రామ రెవిన్యూసదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తులు పెట్టని వారు ఎవరైనా ఉంటే వారి దరఖాస్తు చేసుకోవాలని,అలాగే మరణించిన వారి పట్టా జాబితా నుండి పేర్లు ఎలా మార్చుకోవాలోఅని ప్రజలకు తగు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ మీసేవ కేంద్రాల్లో ధరణి పోర్టల్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఎలాంటి భూ సమస్యలు ఉన్న తమ దృష్టి కి తీసుక రావాలని ప్రజలకు తెలియజేశారు. గ్రామ ప్రజలు, వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్, గ్రామ సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.
