మన్యం న్యూస్ ,వాజేడు: హైదరాబాదులో జాతీయ స్థాయి తైక్వాండో జరిగిన పోటీలలో ఈ నెల 8న జరిగిన వాజేడు మండలం, పేరూరు గ్రామం తింగ ధర్మతేజ 52 కిలోల విభాగంలో బ్రౌన్ మెడల్ సాధించారు. అంతర్జాతీయ టైక్వాండో పోటీలకు అర్హత సాధించారు. ఈ నేపథ్యంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో తైకాండ్వా గురువు ఇర్ఫా బాలాజీ, శిష్యరికం చేసిన ధర్మ తేజకు వాజేడు నాగారం స్కూల్ ఆవరణంలో ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా కన్వీనర్ పర్సిక సతీష్, డివిజన్ అధ్యక్షులు టింగ బుచ్చయ్య, మండల అధ్యక్షులు నరసింహారావు ,తదితరులు పాల్గొన్నారు.
