మన్యం న్యూస్ బూర్గంపాడు జనవరి 20: పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండలంలో వివిధ గ్రామాలకు చెందిన బాధితుల ఇంటికి వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ప్రాణప్రాయ స్థితిలో ఉన్న వారికి ముఖ్య మంత్రి సహాయ నిధి కింద చికిత్స కు తగిన సహాయం బాధితులకు ఆందిస్తుందని అన్నారు, నిరుపేదల సంక్షేమం కోసం పూర్తి భరోసా కల్పిస్తుందని అన్నారు, అర్హులైన ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు, , ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి , మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ మండల ఉపాధ్యక్షుడు జక్కం సుబ్రహ్మణ్యం , మండల యూత్ ప్రెసిడెంట్ గోనెలా నాని , సొసైటీ డైరెక్టర్ బొల్లు రవి, మాజీ ఎంపీటీసీ జక్కం సర్వేశ్వరరావు, సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను, ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు, పార్టీ మండల నాయకులు చుక్కలల్లి బాలాజీ, చిరంజీవి భూక్యా కృష, శ్రీను, నాగేందర్, నకిరిపేట గ్రామ పెద్దలు శివ బొల్లా వెంకన్న నల్లమోతు సురేష్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.