మన్యం న్యూస్ ఇల్లందు జనవరి20:- సీపీఐ (ఏం ఎల్) న్యూడెమోక్రసీ దాని అనుబంధ సంఘాల అధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కోసం, శుక్రవారం రోజు ఫారెస్ట్ గ్రౌండ్ నుంచి జగదాంబ సెంటర్ మీదుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు మాట్లాడుతూ బంగారు తెలంగాణ అని చెపుతున్న రాష్ట్రంలో ఇల్లు లేని వారి బ్రతుకులు కడు దయనీయంగా ఉన్నాయన్నారు. ప్రజలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలందరికీ అన్ని రకాల సౌకర్యాలున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దానం చేసి 8 ఏళ్లు గడిచిపోయాయని,అర కొరగా కట్టించిన ఇండ్లు కూడా ప్రజలకు పంచింది లేదని విమర్శించారు. అరకొరగా ఇచ్చిన ఇండ్లు కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలాయని, తిరిగి మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరోసారి కేసిఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నాటకం తెరపైకి తెచ్చాడని.
ఇప్పటికైనా కేసీఆర్ ప్రకటించిన విధంగా అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
నిర్మాణం పూర్తయి ఖాళీగా ఉన్న ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించాలన్నారు.
ప్రతి ఒక్కరికీ వారికి అనుకూలమైనటువంటి స్థలంలో ఇల్లు కట్టించి ఇవ్వాలని, ప్రతి లబ్ధిదారునికి రూ .5 లక్షల రూపాయలు ఆర్దీక సహాయం అందించాలని
ఇంటి స్థలం లేని వారందరికీ ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇల్లందు ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డబల్ బెడ్రూమ్ సమస్యను ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్)న్యూడెమోక్రసి,పి.ఓ.డబ్ల్యూ, పి.వై.ఎల్ నాయకులు తుపాకుల నాగేశ్వర రావు, పొడుగు నర్సింహా రావు, కొక్కు సారంగపాణి,తోడేటి నాగేశ్వరరావు,చింత ఉదయ్, సువర్ణపాక నాగేశ్వరరావు, ఎల్.చిన్నస్వామి, గూళ్ళ సదయ్య, కల్తి వెంకటేశ్వర్లు, బొగ్గారపు రాజు, వజ్జ మధు,భూక్య మంగ్య, గొగ్గేల రామచంద్రు, పందిర్లపల్లి వీరన్న, జటంంగి వెంకన్న, తొగర సామేలు, రామిశెట్టి నరసింహారావు, జి.రామచందర్,సర్పంచులు మోకాళ్ల కృష్ణ, బాణోత్ సంతు, వాంకుడొత్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
