మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 20: రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించే ప్లేస్ మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు శుక్రవారం అన్నారు. ఉదయం 11 గంటలకు మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలర్ స్కై టెక్నాలజీ సంస్థ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. నిరుద్యోగులు అందరు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
