మన్యం న్యూస్ బూర్గంపాడు జనవరి 21.. మండలంలోని తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పాల్వంచ సీఐ నాగరాజు, బూర్గంపాడు ఎస్సై సంతోష్ లు పినపాక, అంజనాపురం, మొరంపల్లి బంజర్, లక్ష్మీపురం, ముసలమడుగు, సారపాక ప్రాంతాలలో శనివారం బారికెట్లను ఏర్పాటు చేయించారు. ప్రమాదాల నివారణకు స్థానిక ఇండస్ట్రియల్ సహకారంతో బారికెళ్లను ఏర్పాటు చేశామని వాహనాల వేగ నియంత్రణకు దోహదపడుతుందని సీఐ తెలిపారు. అతివేగం ప్రమాదకరమని డ్రైవింగ్ చేసే సమయంలో సెల్ ఫోన్ ఉపయోగించరాదని తాగి డ్రైవింగ్ చేయరాదని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ను విధిగా ధరించాలని పేర్కొన్నారు.
ప్రమాదాలు నివారించేందుకు ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే రోడ్డు సూపర్వైజర్ లకావత్ రమేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
