UPDATES  

 గిదేంది సారు విడ్డూరం.. న్యాయం చేయడంలో వింత పొగడ మద్యం సేవించి చిందేసిన వారిని వదిలేశారు

గిదేంది సారు విడ్డూరం.. న్యాయం చేయడంలో వింత పొగడ
మద్యం సేవించి చిందేసిన వారిని వదిలేశారు
ఎల్చిరెడ్డిపల్లి పాఠశాల అమాయకులను బలి చేశారు
సోషల్ మీడియాలో ఎల్చిరెడ్డిపల్లి ఉపాధ్యాయులకు వస్తున్న మద్దతు
ఏటీడీఓ సారు అధికారులకు తప్పుడు నివేదిక సమర్పించారని ఆరోపణలు
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి: జనవరి 21…. ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్ అంటూ విచక్షణ జ్ఞానాన్ని మరిచి పాఠశాలలో చదువుతున్న బాలికల ముందే కుప్పిగంతులు వేస్తూ చిందేసిన ఉపాధ్యాయుడిని మాత్రం.. ఏమనకుండా వదిలేశారు. మనవాడలే అనుకున్నారేమో.. అధికారులు కూడా తిమ్మనకుండా ఉండటం వెనుక పలు ఆరోపణ వినిపిస్తున్నాయి.. అయితే ఇక్కడ చూడండి
ఇటీవల పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు
ధర్మసోత్ ఉమాదేవి, వార్డెన్ కట్టం భవాని లను పాఠశాలను వదిలేసి సమీప పేరంటాల చెరువుకు వెళ్లారని ఆరోపణలతో విధుల నుంచి బహిష్కరించడం జరిగింది. ఈ విషయమై ఉపాధ్యాయులు స్పందిస్తూ, మేము మనుషులమే అని, బంధాలు- బంధుత్వాలు మాకు ఉంటాయని ఆవేదన వెలిబుచ్చారు. మానవతా దృక్పథంతో అధికారులు ఆలోచించకుండా ఆ మహిళ ఉపాధ్యాయులను విధినిర్వహణకు దూరం చేశారని ఆవేదన చెందుతున్నారు. కానీ ఇటీవలనే ఇల్లందు బాలికల ఆశ్రమ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుడు మద్యం సేవించి విద్యార్థుల ముందు నిలబడి వింతైన నాట్యం చేస్తూ అలరించాడని, ఈ ఒక సంఘటనే మాత్రమే కాక, జిల్లాలో వింతైన వేషాలు వేసిన వారిని వదిలేసి వారి చేష్టలకు ఊడిగం చేసినట్లు అధికారులు కూడా పూర్తి మద్దతునిస్తూ, సహకరించడం ఏమిటని తోటి ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఏ టి డి ఓ సారు కావాలనే ఎల్చిరెడ్డిపల్లి ఉపాధ్యాయులపై తప్పుడు నివేదికను పై అధికారులకు సమర్పించి వారి సస్పెండ్ కు కారణమయ్యాడని ఆరోపిస్తున్నారు. . జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు. విచారణ చేపట్టడంలో న్యాయం చేయడంలో సమ్మతితో ఉన్నతాధికారులు పారదర్శక పాటించకపోతే రానున్న రోజుల్లో ఐటీడీఏ ఉన్నతికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని మేధావి వర్గం యోచిస్తుంది. ఇప్పుడు ఓకేనా ఉన్నతాధికారులు ఏ విధమైన విచారణ చేపడతారు అనేది ప్రశ్నార్ధికంగా మారింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !