మన్యం న్యూస్ ,జనవరి( 22) వాజేడు:
బి.ఆర్.ఎస్ నాయకులు, నూగూరు వెంకటాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య ఆధ్వర్యంలో మండలంలో ఎడుజర్లపల్లి గ్రామ పంచాయతీ ముత్తారం కాలని కి చెందిన పలు కు బి ఆర్ ఎస్ పార్టీలోకి చేరారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు, ఐటీ కంపెనీలు, అతి తక్కువ కాలంలో అభివృద్ధి సాధించిన ఘనత బిఆర్ఎస్ పార్టీకే చెందుతుందని ఆయన అన్నారు. గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను తక్షణమే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల వెన్నంటూ ఉంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెనుమళ్ళ రామకృష్ణారెడ్డి, సర్పంచ్ వాసం మల్లేశ్వరి కారం రాజు, మండల ప్రధాన కార్యదర్శి సోమిడి నర్సింహారావు, చండ్రగొండ.లింగయ్య, జాడి సమ్మయ్య చిటమట శేఖర్, జాడి వీరయ్య,కొండగొర్ల శ్రీను,నాంపల్లి సత్యంబాబు,ఉదయగిరి సత్యనారాయణ,ఎర్రకట్ల సుమన్, కారం, నర్సింహారావు (ఎంపిటిసి, మాజీ) కార్యకర్తలు పాల్గొన్నారు…
