మన్యం న్యూస్ దుమ్ముగూడెం , జనవరి 26
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భద్రాచలం నియోజవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని లక్ష్మీనగరం పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఇటీవల అనారోగ్యం గురికావడంతో ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకొని పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కనితిరాముడు, సీనియర్ నాయకులు ఎండి అలీమ్ ఖాన్, పార్టీ అధికార ప్రతినిధి ఎండి జానీ పాషా, దిశా కమిటీ సభ్యులు మట్ట వెంకటేశ్వర్లు, రైతు విభాగం అధ్యక్షులు వెంకటేశ్వరరావు, కార్యదర్శి జై సింహ, ఎస్సీ సెల్ అధ్యక్షులు మోత్కూరి శ్రీకాంత్, ప్రచార కమిటీ కార్యదర్శి తోట రమేష్, యూత్ అధ్యక్షులు లంక శివ, అల్లాడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.