మన్యం న్యూస్ గుండాల జనవరి 26: కాంగ్రెస్ నాయకులు ధనసరి సూర్య గుండాల మండలంలో గురువారం విస్తృతంగా పర్యటించారు. మండలం పరిధిలోని సాయనపల్లి గ్రామపంచాయతీ కారోబార్ కూతురు ఓణీల వేడుక లో పాల్గొన్నారు. అనంతరం వేపలగడ్డ గ్రామానికి చెందిన పూనం రాములు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకొని ఇంటికి వచ్చిన క్రమంలో అతనిని పరామర్శించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముత్యమాచారి, ఎంపీటీసీ కృష్ణారావు, నాయకులు పాపారావు, పెండేకట్ల దుర్గ, ఎన్ ఎస్ సి యు ఐ నాయకులు పవన్ కళ్యాణ్ ,సూర్య మిత్రులు ఆజాద్, పాష , సాహెబ్, తదితరులు పాల్గొన్నారు
