మన్యం న్యూస్ దుమ్ముగూడెం , జనవరి 27
అంగన్వాడి కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మి పథకం కింద అందిస్తున్న మధ్యాహ్న భోజన మెనూ బిల్లును పెంచాలని శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో ఐసిడిఎస్ కేంద్రంలో నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి పాల్గొని మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు .అంగన్వాడి కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు నిధులు కేటాయించాలని ఎటువంటి సరుకులు లేకుండా మినీ అంగన్వాడీ కేంద్రాలు అన్నిటిని పూర్తిస్థాయి అంగన్వాడీ కేంద్రంగా మార్పు చేయాలని కోరారు ఐసిడిఎస్ పరిరక్షణ కోసం ఏప్రిల్ 5న చలో పార్లమెంట్ కార్యక్రమం నిర్వహిస్తామని మార్చి ఒకటి నుంచి మూడు తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తామని ఈలోగా ప్రభుత్వం సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్లతో పత్రాన్ని సిడిపిఓ సలోని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కొరస చిలకమ్మ, అంగన్వాడీ టీచర్స్ నాయకురాలు కమలాదేవి, బుచ్చమ్మ, గజలక్ష్మి, కృష్ణవేణి, రమణ, సృజన, రాజేశ్వరి, విజయలక్ష్మి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.