UPDATES  

 విద్యార్థుల అల్పాహారానికి ఆర్థిక సహాయాన్ని అందించిన సివిల్ కోర్టు జడ్జి ప్రభాకర్ రావు..

 

మన్యం న్యూస్ : జూలూరుపాడు, జనవరి 30, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండల పరిధిలోని గుండెపుడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం ఏర్పాటు కొరకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీప్ జడ్జి కాళ్ళూరి ప్రభాకర్ రావు 10 వేల రూపాయలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లలితా భవానికి సోమవారం తమ కుటుంబ సభ్యులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. అందరూ చక్కగా చదువుకొని, మన గ్రామానికి, మీ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని, బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. పాఠశాల విద్యార్థులకు ఆర్ధిక సహాయాన్ని అందించిన సివిల్ కోర్టు జడ్జి ప్రభాకర్ రావుకి పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరసింహారావు, కాళ్ళూరి వెంకటేశ్వరరావు, సుమంత్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !