మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి01: ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులో గత 15 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికురాలు బుధవారం తాండ్ర ఉమ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే ఉమ పనిచేస్తున్న ఏరియాకు ఆమెని కాదని వేరొకరిని నియమించటం మూలంగా మనస్తాపానికి గురయ్యి ఫినాయిల్ తాగి చనిపోవటానికి ప్రత్నించింది.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఉమను ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.పరిస్థితి విషమించడంతో కొత్తగూడెం ఏరియా దవాఖానకు తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు.