UPDATES  

 పేదలు గుడిసెలు వేసుకున్న ప్రభుత్వ భూమికి పట్టాలు ఇవ్వాలి.

పేదలు గుడిసెలు వేసుకున్న ప్రభుత్వ భూమికి పట్టాలు ఇవ్వాలి.
ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి. చుంచుపల్లి తహా సిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం.,తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 01… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని సర్వే నెంబర్ 137/1 ప్రభుత్వ భూమి లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు,ఇంటి స్థలాల పోరాట కమిటీ నాయకులు పోతినేని సుదర్శన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, బుధవారం నాడు వెంకటేశ్వర కాలని నుంచి చుంచుపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు,ఈ సందర్భంగా రేపాకుల శ్రీనివాస్ అద్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఇంటి స్థలం, ఇండ్లు లేక, పేదలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ, ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని పేదలందరికీ డబుల్ బెడ్ రూం నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే అభివృద్ధి కాగితాల్లో ఉందని విమర్శించారు, ప్రజలకు ఇండ్లు, విద్య, భూమి, వైద్యం అందినప్పుడే నిజమైన అభివృద్ధి అన్నారు,ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరరపు కనకయ్య లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి కొమరం భీం కాలని లో నివసిస్తున్న పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు, మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో, జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్,డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లిక్కి బాలరాజు, సీఐటీయూ జిల్లా నాయకులు భూక్యా రమేష్, వీరన్న,ఐద్వా నాయకురాలు ఎస్ లక్ష్మి,ఈసం రాంబాబు, బాలక్రిష్ణ,ప్రేమ్ కుమార్,జబ్బ సంధ్యారాణి,రాము,సిద్దెల రాములు, పూజారి నాగమణి, వీరమ్మ,రామకోటమ్మ,శివ,రాజు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !