మన్యం న్యూgస్, మణుగూరు, ఫిబ్రవరి 02: మండలంలోని మినీ మేడారం తోగ్గూడెంలో సుంకు జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం మూడవరోజు భక్తుల అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. తమ మొక్కులను తీర్చుకున్నారు. డబ్బు చప్పుల్ల తో, సమ్మక్క సారాలమ్మల నామస్మరణతో ఆలయం మారుమోగిపోయింది.
