మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 03: రానున్న ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని బిజెపి పినపాక అసెంబ్లీ కన్వీనర్ పున్నం బిక్షపతి, పట్టణ అధ్యక్షులు లింగంపల్లి రమేష్ లు అన్నారు. వారు శుక్రవారం మణుగూరు పట్టణంలో నూతన బిజెపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణలో రానున్నది మా ప్రభుత్వమే అన్నారు. పినపాక అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుని రాష్ట్ర పార్టీకి బహుమతిగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎడ్లపల్లి శ్రీనివాస్, భూక్య సీతారాం నాయక్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భూక్య దివ్యశ్రీ ,గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఈసాల వెంకటేశ్వర్లు ,ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు రవీంద్రనాథ్, పినపాక విస్తారక్ కొండి ప్రభాకర్, పట్టణ ప్రధాన కార్యదర్శులు కట్టా నారాయణమూర్తి, బీర రమేష్, పల్లపు కిషోర్, అనబత్తుల వెంకన్న, పోలబోయిన ప్రభాకర్, ఎర్రోజు నాగమణి, సిలివేరి రేణుక, కుంజా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
