UPDATES  

 శభాష్ సర్పంచ్ సర్వం కోల్పోయిన కుటుంబానికి భరోసా..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 03..
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు  కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన కుటుంబానికి పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలక్ష్మి. భరోసాగా నిలిచింది. మండలంలోని పర్ణశాల గ్రామపంచాయతీ పరిధిలోని సీతానగరం గ్రామం తెల్లం వారి గుంపులో నివసిస్తున్న నిరుపేద కుటుంబమైన శ్యామల వెంకటేష్ ఇల్లు ప్రమాదవశాస్తు అగ్నికి ఆహుతై సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలి ఉన్నారు. దీంతో శుక్రవారం వారిని పరమర్శించి నేనున్నానని భరోసాగా 50 కేజీల బియ్యం వంట సామాగ్రి దుప్పట్లు నిత్యవసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రానున్న వేసవి కాలంలో ఏజెన్సీ గ్రామంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ సంభవించే అవకాశం ఉండడంతో మండల కేంద్రంలోని ఎప్పుడు ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలానే సర్వం కోల్పోయి రోడ్డున పడ్డా కుటుంబాన్ని ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని కోరారు. పంచాయతీ పరిధిలోని ఉన్నటువంటి ప్రజలు ఈ కుటుంబాన్ని ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ పోడియం వెంకటరమణ, కాంగ్రెస్ నాయకులు తెల్లం హరికృష్ణ, కిషోర్, సురేష్, సారయ్య, మురళి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !