మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 04: మాదిగ ఐక్యవేదిక సభ్యులు నైనారపు నాగేశ్వరరావు కూతురు సంధ్యారాణికి సీనియర్ జర్నలిస్ట్ మాచర్ల శ్రీనివాస్ పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శనివారం అందజేశారు. సంధ్యారాణి హైదరాబాద్ లోని దుర్గాబాయి దేశ్ముఖ్ కళాశాల ఓయూ క్యాంపస్ లో బీఎస్సీ నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతుంది. ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నందున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రావులపల్లి రామ్మూర్తి, గంగపురి మురళి, నరేష్ ,పొడుతూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
