UPDATES  

 బాలికల్లో చైతన్యం కోసమే వాయిస్ ఫర్ గర్ల్స్   – భద్రాచలం గురుకులం ప్రిన్సిపల్ ఎం.దేవదాసు  

మన్యం న్యూస్, భద్రాచలం ఫిబ్రవరి 05
బాలికల్లో అంతర్గతంగా దాగి ఉన్న  నైపుణ్యాల్ని వెలికి తీసి వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకు వెళ్లే విధంగా  చేపట్టిన వినూత్న కార్యక్రమమే వాయిస్ ఫర్ గర్ల్స్ అని భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ ఎం.దేవదాసు పేర్కొన్నారు. ఆదివారం వాయిస్ ఫర్ గర్ల్స్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాలలో గత పది రోజులుగా వాయిస్ ఫర్ గర్ల్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాదుకు చెందిన ఎన్జీవో సంస్థ సభ్యులు బాలికలకు అనేక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ ప్రోగ్రాం ముగింపు వేడుక ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… ఇటువంటి కార్యక్రమాలు బాలికల్లో చైతన్యాన్ని తీసుకొస్తాయన్నారు. బాలికల్లో ధైర్యాన్ని నింపడం ద్వారా  వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించబడుతుందని పేర్కొన్నారు. బాలికలు విద్యతోపాటు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని సూచించారు. వాయిస్ ఫర్ గర్ల్స్ ప్రోగ్రాం నిర్వహించేందుకు సహకరించిన భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ గౌతమ్ పోట్రూ ఐఏఎస్,  భద్రాచలం ఐటిడిఏ ఏపీఓ జనరల్,  ఆర్సిఓ గురుకులం డేవిడ్ రాజ్ లకి ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలిపారు.  పది రోజులపాటు వాయిస్ ఫర్ గర్ల్స్ ప్రోగ్రాంలో నేర్చుకున్న అంశాలను  గిరిజన గురుకుల బాలికలు ప్రదర్శన ఇచ్చారు.  వాయిస్ ఫర్ గర్ల్స్ ప్రోగ్రాం తమకు ఎన్నో విషయాలను నేర్పిందని బాలికలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో గురుకులం పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ లకావత్ సరస్వతి, వాయిస్ ఫర్ గర్ల్స్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అనూష,  కౌన్సిలర్స్ మౌనిక,  కావ్య, కుమారి, మహేశ్వరి, మానస, వై.మౌనిక, వీణ రాణి, అక్షయ, పాఠశాల, కళాశాల టీచర్స్, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !