మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 12: మండల పరిదిలోని ఊట్లపల్లి గ్రామం సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే పత్తిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి కంటైనర్ లారీ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు ఏలూరు జిల్లా కుకునూరు మండలం కొండపల్లి గ్రామం నుంచి పత్తిలోడుతో అశ్వరావుపేట వైపు వెళుతున్న ట్రాక్టర్ను కంటైనర్ లారీ రాళ్ల బండలతో ఆంధ్ర వైపు వెళుతుండగా ట్రాక్టర్ ను వెనకనుంచి ఢీకొనడంతో పీరాల ప్రసాదు (30) సంవత్సరాలు అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పంచనామ నిమిత్తం అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
