- రూ.97.60 లక్షల విలువగల..
- 488 కేజీల గంజాయి పట్టివేత, రెండు వాహనాలు స్వాధీనం ..ఇద్దరిపై కేసు నమోదు…
- విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 13… సీసీఎస్ పోలీసులు భద్రాచలం పోలీసులు తమ సిబ్బందితో కలిసి భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఆదివారం సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బస్టాండ్ వైపు నుంచి భద్రాచలం బ్రిడ్జి వైపుగా వస్తున్న రెండు ఇన్నోవా వాహనాలు పోలీసు వారిని చూసి ఇద్దరు డ్రైవర్లు వాహనాలను వదిలేసి పారిపోతుండగా గమనించి వారిని వెంబడించి పట్టుకుని విచారించడం జరిగిందని ఆ వాహనాలలో రూ. 97.60. లక్షల విలువ గల 488 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఏపీ 29 బి.ఆర్ 1116 , ఏపీ 09 ఏ జెడ్ 9868 అను నంబర్లు కలిగిన ఇన్నోవా వాహనాలను తనిఖీ చేయగా సుమారుగా 97,60,000/- రూపాయల విలువ కలిగిన 488 కేజీల ప్రభుత్వ నిషేధిత గంజాయిని తరలిస్తున్నట్లుగా గుర్తించడం జరిగిందన్నారు. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను విచారించగా ఒకరు డి. శివశంకర్ రెడ్డి, 33 సం. తాళ్ల గొమ్మురు, సారపాక గ్రామం. మరొకరు కలిపి నాగేంద్రబాబు,30 సం., డ్రైవర్ గా పనిచేస్తూ మజీద్ కాలనీ, సారపాక చెందిన వారిగా గుర్తించమన్నారు అయితే వీరిద్దరూ. ఆంధ్రప్రదేశ్ – ఒడిసా సరిహద్దు పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి నిషేధిత గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్ర రాష్ట్రం జహీరాబాద్ కు చెందిన అమీర్ అనే వ్యక్తి కి అమ్మడానికి తరలిస్తున్నట్లు వీరిరువురు అంగీకరించారని అన్నారు.. ముఖ్య నిందితుడైన శివశంకర్ రెడ్డి మూడు కేసులలో ఉన్నాడని. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అతనిపై పీడి యాక్ట్ నమోదుకు ప్రతిపాదన చేయడం జరుగుతుంది. తెలిపారు.
గతంలో కూడా పలుమార్లు శివశంకర్ రెడ్డి నిషేధిత గంజాయిని ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దు నుంచి కొనుగోలు చేసి అక్రమంగా తరలించి జహీరాబాద్ కు చెందిన అమీర్ , ఆదిత్య కు అమ్మి అక్రమంగా డబ్బులు సంపాదించినట్లు విచారణలో తేలిందన్నారు.. అనంతరం పట్టుబడిన వీరి వద్ద నుండి 228 ప్యాకెట్లలోని 488 కేజీల గంజాయిని, రెండు ఇన్నోవా కార్లను, ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టునకు తరలించడం జరుగుతుందని అన్నారు.ఇప్పటి వరకు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన 18 మంది వ్యక్తులపై పీడీ యాక్టును నమోదు చేయడం జరిగిందని. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భద్రాచలం ఏ ఎస్ పి , సీసీఎస్ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు 11 కేసులలో 32 మందిని అరెస్టు చేసి 1.3 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్పష్టం చేశారు.
యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వం గంజాయి అక్రమ రవాణాను అరికట్టడానికి పటిష్టమైన చర్యలు చేపడుతుందని. ఇందులో భాగంగానే గంజాయి అక్రమ రవాణాదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం. జరిగిందన్నారు. ఎవరైనా ప్రభుత్వ నిషేధిత గంజాయిను అక్రమంగా తరలించాలని చూసినా, వారికి ఆర్థికంగా సహకరించినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, వ్యవహారశైలిపై ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. తమ పిల్లలు మాదకద్రవ్యాలకు అలవాటు పడినట్లుగా తెలిస్తే పోలీసువారికి సమాచారం ఇస్తే వారికి సాధారణ కౌన్సిలింగ్ నిర్వహించి వారి ఉజ్వల భవిష్యత్తు కోసం దిశా, నిర్దేశం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అక్రమంగా తరలుతున్న గంజాయిని చాకచక్యంగా ఛేదించి పట్టుకున్న పోలీసులను ఈ సందర్భంగా అభినందించారు