మన్యం న్యూస్ చండ్రుగొండ,ఫిబ్రవరి14 :
అన్ని మతాల సారంశం ఒక్కటేనని, అభాగ్యులకు అండగా నిలుద్దామని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్సీఎం చర్చీల బిషప్ యు.బాల అన్నారు. మంగళవారం అయ్యన్నపాలెం అర్సీఎం చర్చీ వార్షికోత్సవం సందర్భంగా చండ్రుగొండ బస్టాండ్ సెంటర్ నుంచి అయ్యన్నపాలెం వరకు క్రైస్తవులు సాంస్కృతిక ప్రదర్సనలతో బిషప్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.శాంతిమార్గంలోనే ప్రతి యొక్కరు పయనించాలన్నారు. ఇతరులను ప్రేమించటం ద్వారా మంచి మనుషులుగా తయారవుతారన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జోషప్ పాఠశాల హెచ్ఎం ఇమ్మల్గా, చర్చీ పాస్టర్ లు కె.రమేష్, ఏసురత్నం, సంఘ బాధ్యులు, క్రైస్తవులు, గ్రామ పెద్దలు, చాపలమడుగు ప్రసాద్, చాపలమడుగు వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు మేడా మోహన్ రావు , వంకాయలపాటి బాబురావు, తదితరులు పాల్గొన్నారు.