- అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి
- అసమానలతు లేని సమాసంకోసం తుదిశ్వాస వరకు పోరాడిన శేషగిరిరావు, ధర్మా బిక్షం
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
- సిపిఐ, ఏఐటియుసి ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి, జయంతి
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 15. కార్మిక వర్గంకోసం, పేద ప్రజలకోసం తమ జీవితాలను అంకితం చేసి పోరాడిన నాటి అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకోసం నేటితరం కమ్యూనిస్టు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక సభ్యులు, స్వాతంత్ర్య సమరయోధులు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు దేవూరి శేషగిరిరావు 75వ వర్ధంతి, మాజీ ఎంపి, సాయుధపోరాడ యోధులు బొమ్మగాని దర్మభిక్షం 101వ జయంతిని బుధవారం శేషగిరిభవన్లో ఘనంగా నిర్వహించారు. తొలుత నేతల చిత్రపఠాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులిర్పించారు. అనంతరం జరిగిన సంస్మరణ సభలో కూనంనేని మాట్లాడుతూ సింగరేణి ప్రధాన కార్యాలయంలో సాధారణ ఉద్యోగిగా జీవితం ప్రారంభించిన శేషగిరిరావు నాడు నాటి బ్రిటీష్ తెల్లదొరల కార్మికుల దోపిడికి వ్యతిరేకంగా పోరాటాలకు శ్రీకారం చుట్టారన్నారు. బొగ్గుగనుల్లో మహిళలు, పిల్లలతో పనిచేయించే విధాన్ని వ్యతిరేకించిన తొలితరం ఉద్యమకారుడు శేషగిరిరావు అని కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీ పిలుపుతో ఈ ప్రాంతంలో బ్రిటీష్ దోరల నిరంకుషపాలనకు, రజాకార్ల దొపిడి వ్యవస్థ నిర్మూళనకోసం పోరాడిన ధీశాలి శేషగిరిరావు అని, అండర్గ్రౌండ్ దళానికి నాయకత్వం వహించి పోరాడన్నారు. సింగరేణి, ప్రభుత్వ, ప్రైవేటు రంగ పరిశ్రమల్లో ఎనిమిది గంటల పనివిధానం అమలు ఆయన పోరాట ఫలితమేనన్నారు. కార్మికవర్గం, ప్రజలకోసం పోరాడిన శేషగిరావుతోపాటు ఆయనతో సహచరులు రంగయ్య, పాపయ్యలు అప్పటి రజాకార్లు బూర్గంపాడు ప్రాంతంలో కాల్చి చంపారని పేర్కొన్నారు. సమాజానికి ఎంచేయాలనుకున్నాడో దాన్ని నెరవేర్చేందుకు విద్యార్థి దశ నుంచి స్వాతంత్ర్యం అనంతరం వరకు జరిగిన విరోచిత తెలంగాణ పోరాటంలో ధర్మబిక్షం ప్రముఖపాత్ర పోషించాడని, ఎమ్మెల్యేగా, ఎంపీగా నిస్వార్ధంగా ప్రజాసేవ చేశాడని అదేవిదంగా రాష్ట్ర వ్యాపితంగా గీత కార్మికుల హక్కులకోసం నిర్విరామంగా కృషి చేశాడని కొనియాడారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా, జిల్లా నాయకులు సలిగంటి శ్రీనివాస్, దమ్మాలపాటి శేషయ్య, వాసిరెడ్డి మురళి, వట్టికొండ మల్లికార్జున్రావు, వంగా వెంకట్, కె.రత్నకుమారి, మోటపలుకుల రమేష్, కిష్టాఫర్, మాతంగి లింగయ్య, ఉమాయున్, సందబోయిన శ్రీనివాస్, రాజేశ్వర్రావు, లక్ష్మినారాయణ, షాహీన్, పుట్టి భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, అక్తర్ తదితరులు పాల్గొన్నారు.