మన్యం న్యూస్ చండ్రుగొండ ఫిబ్రవరి 15 : మండల కేంద్రంలో బిజెపి మండల ఉపాధ్యక్షుడు రాజేష్ నాయక్ అధ్యక్షతన ప్రజాగోస – బిజెపి భరోసా కార్నర్ మీటింగ్ ఆశ్వరావుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్య ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం చండ్రుగొండ లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతో ప్రజాగోస – బిజెపి భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన,ఆయుష్మాన్ భారత్ పథకాలు, రామగుండం ఎన్టిపిసి ద్వారా రూ. 8500 కోట్లతో 4000, మెగావాట్ల ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కేంద్రం మంజూరు చేసిందని, ఎల్ఈడీ లైట్లు, సిసి రోడ్లు, రైతు వేదికలు,వైకుంఠధామాలు లాంటి అభివృద్ధి పనులు కేంద్రం నిధుల వల్లనే ఏర్పడ్డాయన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ, అవినీతి, కుటుంబ పాలన అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి ఉడతమనేని విశ్వేశ్వరరావు, ఓ బి సి జిల్లా ఉపాధ్యక్షుడు నిరంజన్ దాస్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి గుగులోత్ నిలవర్ణ, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు గుగులోత్ బాలు, భాను, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
