మన్యం న్యూస్ గుండాల..పాయం సత్యం న్యూ డెమోక్రసీ పార్టీకి సాయం సత్యం సేవలు మరువలేనివని న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అవునురి మధు అన్నారు. బుధవారం ఆళ్లపల్లి మండలం రాఘవాపురం గ్రామంలో పాయం సత్యం సంతాప సభను పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆదివాసి పీడిత ప్రజల నాయకుడిగా సత్యం ప్రజలలో ఎంతో గుర్తింపు సంపాదించారని అన్నారు. ప్రజల కోసం అనేక ఉద్యమాలలో ముందుండి పాల్గొన్నారు . అలాంటి నాయకుడిని కోల్పోవడం పార్టీకి తీరని లోటని ఆయన అన్నారు. సత్యం సేవలు చిరస్పనీయంగా నిలిచిపోతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, నాయకులు కొమరం హనుమంతరావు, కోరం సీతారాములు, బట్టు ప్రసాద్, కొమరం సత్యనారాయణ, బత్తిని సత్యం, పరిషిక రవి, పూనెం రంగన్న, యాసారపు వెంకన్న, గడ్డం లాలయ్య, పెండకట్ల పాపారావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు
