మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 16
రైతులు తమ వ్యవసాయ మోటార్లకు ఆయిల్ కెపాసిటర్లు అమర్చుకొని విద్యుత్ ఆదాకు తోడ్పడాలని ఏడూళ్ళ బయ్యారం విద్యుత్ శాఖ ఏఈ కావ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. రైతులు నిరంతరంగా ఆటో స్టాటర్లు ఉపయోగించడం వలన ఒక వైపు నీరు మరొకవైపు విద్యుత్తు వృధాగా ఖర్చు అవుతున్నదని, అదేపనిగా ఆటో స్టాటర్లు ఉపయోగించడం వలన, నీటి వినియోగం పెరిగి జలవనులు తగ్గిపోయే అవకాశం ఉందని తెలియజేశారు. కావున ప్రతి రైతు సోదరులు ఈ విషయాన్ని తెలుసుకుని విద్యుత్ ఆదాకు సహకరించాలని కోరారు.