మన్యం న్యూస్, మంగపేట, ఫిబ్రవరి 17
మంగపేట మండలం దోమెడ గ్రామం లో నాగులమ్మ వనదేవతల ఎదుర్కొ లు మహోత్సవం ను ఆలయ పూజారి పాయం నర్సింహారావు (దేవర బాల) ఆధ్వ ర్యంలో శుక్రవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహిం చారు.నాగులమ్మ జాతర మంగళవారం మండే మెలిగే కార్య క్రమంతో ప్రారంభం అయింది రెండో రోజు దేవరను గుట్ట మీద నుంచి గుడికి తీసుకొని వచ్చారు.మూడో రోజు కొప్పు గుట్ట నుంచి డోలు వాయిద్యాల నడుమ దోమెడకు తీసుకొని వచ్చిన నాగు లమ్మ అమ్మవారికి గ్రామంలొ ఎదుర్కొలు ను గిరిజన సంప్రదాయ పద్ధతిలొ నిర్వహించారు.మహిళలు మంగళ హారతి నీటి బిందెలతో ఎదురేగి నీళ్లు అరబోసి తమ భక్తిని చా టుకున్నారు.ఆలయం లో కోరిన కోర్కెలు తీర్చాలని మహిళలు యువకులు వరం పట్టారు.అమ్మ వారి అనుగ్రహంతో ఆలయ పూజారి పాయం నర్సింహారావు అగ్ని గుండాలలొ నడవడం, ముళ్ల ఉయ్యాలపై ఉరిగే కార్యక్రమంను తిలకించుటకు దోమెడ పరిధిలో తక్కళ్ల గూడెం,చింత కుంట,నిమ్మ గూడెం,తిమ్మాపురం,బ్రాహ్మణ పల్లి,రాజుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని వివిధ గ్రామల నుంచి భక్తులు అధిక సంఖ్యలొ వచ్చారు.ఈ కార్యక్ర మంలో నాగులమ్మ జాతర కమిటీ సభ్యు లు,గ్రామ పెద్దలు మేకల పుల్లయ్య,కొమరం లక్ష్మ య్య,సోయం అచ్చయ, బిజ్జ లక్ష్మయ్య,బిజ్జా భూషణం,మేకల పోతు రాజు,కొమరం రత్తయ్య, తోలేం నర్సింగరావు, మేకల సాంబశివరావు, పూనేం పెంటయ్య, నాగులమ్మ జాతర యూత్ సభ్యులు తోలం ప్రసాద్,కొమరం రఘు, రామ నాథం,మేకల వెంకటేష్,పోయం ప్రసాద్,బిజ్జ స్వామి,కోర గట్ల మధు,కొమరం రాజేష్,పాయం హేమం త్,కొమరం రాజేష్, పాల్గొన్నారు.
