UPDATES  

 జాతీయ హాకీ పోటీలకు ‘గూడెం ‘ క్రీడాకారుల ఎంపిక రాష్ట్ర జట్టు మేనేజర్ గా పూర్ణిమ

మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 17.. జాతీయ స్థాయి హాకీ పోటీలకు కొత్తగూడానికి చెందిన వి వర్షిత, రిషిత రెడ్డి లు ఎంపికైనట్లు జిల్లా హాకీ ప్రధాన కార్యదర్శి బట్టు ప్రేమ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు
ఇటీవల హైదరాబాదులో జరిగిన
ఎంపికలలో అద్భుతమైన
ప్రదర్శనను కనపర్చిన జిల్లాకు చెందిన వరిత, రిషిత
రెడ్డి తెలంగాణ రాష్ట్ర తుది జట్టుకు ఎంపిక అయ్యారని తెలిపారు. జాతీయ స్థాయి హాకీ పోటీలు
ఈ నెల 15 నుంచి 28 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఈమంది ఉదయ్ కుమార్ తెలిపారు. జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులను జిల్లా అసోసియేషన్ చైర్మన్ లగడపాటి రమేష్, పల్లపోతు వాసు, కోచ్ ఇమామ్, సాలెం ఖాన్ రాజకుమార్ కృష్ణవేణి, కవిత, మంజుల ,రాజు కుమారి, రవికుమార్ తదితరులు హర్షవర్తం చేశారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !