మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 17: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని శివాలయాలు ముస్తాబయ్యాయి. ఆలయ కమిటీల నిర్వాహకులు ఆలయాలను అందంగా తీర్చిదిద్దారు. శనివారం శివరాత్రి సందర్భంగా భక్తులు తెల్లవారుజామున గోదావరికి వెళ్లి పుణ్య స్నానాలను ఆచరించి శివాలయాలకు చేరుకుంటారు. అనంతరం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గోదావరికి, ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటను పూర్తి చేశారు. ముఖ్యంగా గోదావరి స్నానాలు వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
