మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 16
మండలంలోని పర్ణశాల పంచాయతీ సీతానగరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 51/1, 49/1,44/4,30/1 గల సాగు భూములు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కరకట్ట నిర్మాణం కొరకు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం డివిజన్ అధ్యక్షుడు సోంది మల్లు దొర తో కలిసి తాసిల్దార్ చంద్రశేఖర్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములను కోల్పోయిన బాధ్యులకు పూర్తిస్థాయి సర్వే చేపించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా భూములను తవ్వాలని ప్రయత్నిస్తే ఆదివాసి సంక్షేమ పరిషత్ తరపున బాధితులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధితులు పి నాగమణి, వాగ చలపతిరావు, కోరం రామచిట్టి, లక్ష్మయ్య, రాముడు, ఆదెమ్మ, ముత్తయ్య, ఆదివాసి నాయకులు వాగే వెంకటేశ్వరరావు, కోరం మురళి తదితరులు పాల్గొన్నారు.
