UPDATES  

 బంగారు,వెండి పతకాలు సాధించిన జిల్లా పోలీసు జాగిలాలు జాగిలాలను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ డా.వినీత్

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 20…తెలంగాణ,అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ జాగిలాలకు గత సంవత్సరం జూన్ మాసం నుంచి ఈనెల 16వ తేదీ వరకు మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ నందు శిక్షణ ఇప్పించడం జరిగింది.8 నెలల శిక్షణ ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన పరీక్షలలో అత్యంత ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచిన గ్రేసి బంగారు పతకాన్ని,రెండవ స్థానంలో నిలిచిన రీనా కు వెండి పతకాన్ని గెలుచుకున్నాయి సోమవారం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించబడిన నార్కోటిక్స్ విభాగంలో శిక్షణ పొందిన ఈ రెండు జాగిలాలు అత్యంత ప్రతిభ కనబరిచి పథకాలను గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందని జిల్లా ఎస్పీ డా.వినీత్ ఈ సందర్భంగా తెలియజేసారు.ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గ్రేసీ,రీనాలను జిల్లా కేంద్రంలో కొత్తగూడెంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన ప్రత్యేకంగా అభినందించారు.పోలీసు జాగిలాల సంరక్షణకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలను పాటించాలని పాల్గొన్న అధికారులు సిబ్బందికి తెలియజేసారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,ఏఆర్ డిఎస్పీ విజయ్ బాబు,ఆర్ఐలు దామోదర్,సోములు ఏఆర్ ఎస్సై పెంటోజిరావు,హెడ్ కానిస్టేబుల్ నాగుల్ మీరా(రీనా హాండ్లర్),కానిస్టేబుల్ వెంకటేష్(గ్రేసీ హాండ్లెర్) తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !