UPDATES  

 మార్చి 1 నుంచి 4వరకు పగిడిద్దరాజు జాతర

మన్యం న్యూస్ గుండాల, ఫిబ్రవరి 19 మండలం పరిధిలోని యాపలగడ్డ గ్రామ సమీపంలో కొలువైయున్న మేడారం సమ్మక్క భర్త పగిడిద్ద రాజు జాతర తేదీలు ఖరారయ్యాయి మార్చి 1 తారీకు నుంచి 4 తారీఖు వరకు జాతరను నిర్వహించనున్నట్లు కమిటీ నిర్వాహకులు అరెం అప్పయ్య,ఆరెం పెద్ద బుచ్చయ్య, ఆరేం బిక్షం, ఆరేం కాంతారావు పేర్కొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని వారు కోరారు. ముఖ్య అతిథులుగా పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య రానున్నట్లు వారు పేర్కొన్నారు. ఇందులో భాగంగా వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులకు మానాల భద్రయ్య , శాంతమ్మల జ్ఞాపకార్థం మనమండ్లు మానాల సతీష్ కుమార్, మానాల శ్రవణ్ కుమార్ ఇవ్వనున్నట్లు వారు పేర్కొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !