UPDATES  

 కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి జడ్పీటీసీ

మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి 22…మండలంలోని నకిరిపేట పంచాయతీ లో గల ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని బుధవారం  మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మండలంలోని 18 సంవత్సరాలు పైబడిన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఉచితంగా పరీక్షలు చేసి తగిన కళ్లద్దాలు, మందులు  అందిస్తున్నారు. కంటి వెలుగు కార్యక్రమం 6 నెలలు కొనసాగుందని. కంటి పరీక్షలు చెపించుకోవలిసిన వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాటు చేయాలని పంచాయతీ సిబ్బంది కోరటం జరిగింది. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవతం చేయటానికి  అందరు కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పారు.ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ చెర్ప వెంకటేశ్వర్లు, భారత రాష్ట్ర సమితి పార్టీ ఉపసర్పంచ్ బొల్లా ఉమారాణి, గ్రామకమిటి అధ్యక్షులు వీరన్న, వార్డ్ నెంబర్ దాసరిమల్సూర్, గ్రామ పెద్దలు బొల్లా వెంకన్న , సారయ్య, శివ, కృష్ణ, బానోత్ సురేష్, తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !