మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి22: రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు మణుగూరు మండలంలోని సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే రేగాకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
